ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వినూతనంగా డప్పు సాటింపు

-

తెలంగాణలో ఇఫ్పటికే ఎన్నికల హడావుడి నెలకొంది. ఓవైపు అధికార బీఆర్ఎస్, మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు నువ్వా నేనా ? అంటూ మాటల యుద్ధం కొనసాగుతుతంది. తాజాగా నాగర్ కర్నూల్ BRS ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గ్రామ పర్యటన సందర్భంగా విన్నూత్నంగా డప్పు సాటింపు ఇచ్చారు.  మర్రి జనార్దన్ రెడ్డి ఓ గ్రామానికి వచ్చినపుడు గుడి దగ్గరికి బోనంతో వచ్చిన వారికి 300, బతుకమ్మతో వచ్చిన వారికి 200, డాన్స్ చేసిన వారికి ఫుల్ బీర్ బాటిల్ అని సాటింపు ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరోవైపు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు తనను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కేడర్ కి చెబితే మీలో ఒక్కరూ కూడా బయట తిరగరు అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఒక్కొక్కరిని కాల్చిపడేస్తానని.. తాను తలుచుకుంటే కాంగ్రెస్ చేయిఊడిపోతుందని.. మర్రి జనార్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్రి జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version