బ్లాక్ బుక్ మొదటి పేజీలో మంత్రి పొన్నం పేరు రాసిన కౌశిక్ రెడ్డి !

-

తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఊహించని షాక్ ఇచ్ఛరీ గులాబీ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఫిల్మ్ నగర్ వేంకటేశ్వర దేవాలయం సాక్షిగా బ్లాక్ బుక్ ఓపెన్ చేసారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. దేవాలయం సాక్షిగా, మీడియా సాక్షిగా బ్లాక్ బుక్ మొదటి పేజీలో మంత్రి పొన్నం ప్రభాకర్ పేరు రాసారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.

MLA Padi Kaushik Reddy opened the black book as witness of Film Nagar Venkateswara Temple

5 ఏండ్ల తరువాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది.. కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ఈ సందర్బంగా పేర్కొన్నారు గులాబీ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. అవినీతి చేసిన మంత్రులను, ఎమ్మెల్యేల పేర్లను బ్లాక్ బుక్ లో రాస్తున్నానంటున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి… దేవాలయం సాక్షిగా, మీడియా సాక్షిగా బ్లాక్ బుక్ మొదటి పేజీలో మంత్రి పొన్నం ప్రభాకర్ పేరు రాసినట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version