ఎమ్మెల్సీ కవిత లిక్కర్ పాలసీ కేసు విచారణ వాయిదా..!

-

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయి బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఇవాళ కోర్టులో విచారణ జరగాల్సి ఉండగా.. అది కాస్త వాయిదా పడింది. లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జీ షీట్ పై విచారణను రౌస్ అవెన్యూ కోర్టు వచ్చే నెల 04కి వాయిదా వేసింది. రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టు జడ్జీ కావేరి బవేజా సీబీఐ ఛార్జీ షీట్ పై విచారణ జరిపారు.

విచారణకు ఎమ్మెల్సీ కవిత, ఆప్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఇతర నిందితులు వర్చువల్ గా హాజరయ్యారు. సీబీఐ వేసిన ఛార్జీ షీట్ లో డాక్యుమెంట్స్ సరిగ్గా లేవని లాయర్స్ కోర్టుకు తెలిపారు. తమకు పంపించిన డాక్యుమెంట్స్ లో పేజీలు బ్లాక్ గా ఉన్నాయని.. కనిపించడం లేదని కోర్టుకు నివేదించారు. గత విచారణ సందర్భంగా సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో ప్రతివాదులకు అందించిన కాపీలలో క్లారిటీగా లేని డాక్యుమెంట్లను మళ్లీ అందజేయాలని ఆదేశిస్తూ.. విచారణను జడ్జీ కావేరి బవేజా అక్టోబర్ 04కి వాయిదా వేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version