తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందజేసింది. ఖరీఫ్ సీజన్ కోసం రైతు భరోసా నిధులను రిలీజ్ చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి రూ. 6000 చొప్పున రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఇప్పటికే 10 ఎకరాల వరకు రైతుల ఖాతాలలో డబ్బులు జమ అయ్యాయి. కొత్తగా 1.40 లక్షల మంది రైతులు రైతు భరోసా పథకంలో చేరారు.

వీరికి కూడా త్వరలోనే నిధులు జమ చేయనున్నట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. కాగా, తెలంగాణలోని రైతులకు గత ఐదు రోజుల నుంచి రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి. దీంతో రైతుల సంతోషపడుతున్నారు.