ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఆయన కారు వల్లే సింగయ్య అనే వ్యక్తి మరణించినట్లు ఓ వీడియో బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను తెలుగు దేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో.. తెగ వైరల్ చేస్తున్నారు.

ఇటీవల సత్తెనపల్లిలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు… జనాలతో కలిసి వచ్చాడు. అయితే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ లోని ఒక వాహనం ఢీకొని.. సింగయ్య మరణించినట్లు వార్తలు వచ్చాయి.
అయితే ఈ కుటుంబాన్ని వైసీపీ నేతలు కూడా పరామర్శించారు. ఇలాంటి నేపథ్యంలో ఓ సంచలన వీడియో బయటకు రావడం జరిగింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణించిన కాన్వాయ్.. ఢీకొట్టడంతో సింగయ్య మృతి చెందినట్లు ఈ వీడియోలో స్పష్టంగా కనిపించింది. మరి ఇందులో ఎంత మేరకు వాస్తవము ఉందో తెలియాల్సి ఉంది.
జగన్ సత్తెనపల్లి పర్యటనలో సింగయ్య ని తొక్కించింది జగన్ కారే pic.twitter.com/OtenxALT7i
— TV5 News (@tv5newsnow) June 22, 2025