కేసీఆర్ ను నమ్మి మోసపోయా..6 నెలలుగా అపాయింట్ మెంట్ లేదు – మోత్కుపల్లి

-

కేసీఆర్ ను నమ్మి మోసపోయానని మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను నమ్మి మోసపోయానని.. కేసీఆరే నన్ను పిలిచారు.. ఆయనే దూరం పెట్టారని మనిపడ్డారు. 6 నెలలుగా అపాయింట్ మెంట్ ఇవ్వకుండా సీఎం కేసీఆర్ నన్ను అవమానించారు.. ఎన్టీఆర్, చంద్రబాబు దగ్గరకే ఈజీగా వెళ్లగలిగాను.. కేసీఆర్ మాత్రం సమయం ఇవ్వటం లేదని అగ్రహించారు.

Motkupalli Narasimhulu COUNTER TO CM KCR

దళితుడు ఇంట్లోకి వస్తే ఆవు మూత్రంతో శుభ్రం చేసుకునే రకం కేసీఆర్… చంద్రబాబు అరెస్ట్ పై కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అరెస్ట్ పై స్పందించకుంటే బీఆర్ఎస్ కే నష్టం
నా మద్దతు లేకుండా నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేదన్నారు. రేవంత్ రెడ్డి వల్లే తెలంగాణలో కాంగ్రెస్ బలపడిందని..30 నియోజకవర్గాల్లో ఏపీ సెటిలర్స్ గెలుపోటములను ప్రభావితం చేస్తారని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి నా తమ్ముడు.. రేవంత్ తో నాకు శత్రుత్వం లేదని చెప్పారు మోత్కుపల్లి నరసింహులు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version