మాదాపూర్ డ్రగ్స్ కేసు.. నేడు విచారణకు హాజరయ్యే ముగ్గురు నిందితులు వీళ్లే

-

రాష్ట్రంలో సంచలనం సృష్టించి.. టాలీవుడ్​లో ప్రకంపనలు రేపిన మాదాపూర్ డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా నిందితులను విచారిస్తున్న నార్కోటిక్ పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలుస్తున్నాయి. ఈ కేసులో తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది భాగమైనట్లుగా.. చాలా మంది డ్రగ్స్ వాడకందార్లుగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం మాదాపూర్ డ్రగ్స్ కేసు.. రేవ్‌ పార్టీలు, వారాంతాల్లో పబ్‌లకు వెళ్లే వ్యాపార, రాజకీయ, సీనీ వర్గాల్లోని పలువురికి దడపుట్టిస్తోంది. సైబరాబాద్‌, హైదరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో మత్తు పదార్థాల కేసుల్లో పట్టుబడుతున్న వారు అధిక శాతం సినీ పరిశ్రమకు చెందిన వారే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలువురు నిందితులను ప్రశ్నించిన పోలీసులు ఇవాళ మరో ముగ్గురు నిందితులను విచారించనున్నారు.

ఇవాళ నార్కోటిక్‌ పోలీసుల విచారణకు ముగ్గురు నిందితులు కల్హర్‌రెడ్డి, స్మార్ట్ పబ్ ఓనర్ సూర్య, ప్రొడ్యూసర్ రవి ఉప్పలపాటి  హాజరుకానున్నారు. డ్రగ్స్ కేసులో పేరు వచ్చినప్పటినుంచి ఈ నిందితులు పరారీలో ఉన్నారు. ఇటీవల ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. పోలీసుల విచారణకు సహకరించాలని కోర్టు అదేశాలు జారీ చేయడంతో ఇవాళ విచారణకు హాజరవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version