కేసీఆర్ సచ్చిపోతే 5 లక్షలు ఇస్తామని మానిఫెస్టోలో పెడతా – ధర్మపురి అరవింద్

-

 

 

నిజామాబాద్ బీజేపీ ధర్మపురి అరవింద్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సచ్చిపోతే 5 లక్షలు, కేటీఆర్ సచ్చిపోతే 10 లక్షలు, కవిత సచ్చిపోతే 20 లక్షలు ఇస్తామని మా పార్టీ మానిఫెస్టోలో పెడతానంటూ నిజామాబాద్ బీజేపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. నిన్న కోరుట్ల నియోజక వర్గంలో బీజేపీ ధర్మపురి అరవింద్ ప్రచారం చేశారు. ఈ సందర్బంగా బీజేపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ.. కేంద్రం ఇచ్చిన నిధుల తోనే గ్రామాల్లో అభివృద్ధి జరిగిందన్నారు.

mp aravind on telangana cm kcr

ఇంటింటికి బీమా కాదు.. కేసిఆర్ చనిపోతే రూ.5 లక్షలు నేనె ఇస్తానంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మీ బిడ్డ, కొడుకు తెలంగాణ కు పట్టిన చెదలు అంటూ ఆగ్రహించారు. ఎలక్షన్ నోటికేషన్ వచ్చిన వెంటనే మద్యం బంద్ చేయాలని ఎలక్షన్ కమిషన్ కు నా విజ్ఞపి అని తెలిపారు. ఎలక్షన్ అయ్యేవరకు ఓటర్లకు మద్యం పంచుతూ తాగుబోతుల్లగా తయారు చేస్తున్నారని ఆగ్రహించారు.. కేసీఆర్ కంటే కాంగ్రెస్ పార్టీ డేంజర్ అని హెచ్చరించారు. ముస్లిం సోదరులారా… ఇప్పటి వరకు బీఅరేఎస్, కాంగ్రెస్ కు ఓట్లేసి మునిగింది చాలు..మాకు ఎలాంటి బేధాలు లేవు అందరి కోసం పని చేస్తామని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news