కేసీఆర్ దోచేది ఎక్కువ.. ప్రజలకు ఇచ్చేది తక్కువ : ఈటల

-

తెలంగాణ సంక్షేమ పథకాల పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్.. దోచుకునేది ఎక్కువ.. ప్రజలకు ఇచ్చేది తక్కువ అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. మద్యం, బెల్ట్ షాపుల ద్వారా ప్రజల సొత్తును కేసీఆర్ దోచుకుంటున్నారని.. లిక్కర్ పేరుతో ప్రజల రక్తం తాగుతున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్​ను గద్దె దించితేనే రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలు తగ్గుతాయని చెప్పారు. నిరుద్యోగ భృతి, రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు రావాలంటే కేసీఆర్ గద్దె దిగాలని.. బీజేపీ అధికారంలోకి రావాలని ఈటల రాజేందర్ అన్నారు.

మహేశ్వరం నియోజకవర్గం జిల్లాలగూడలో బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గం నుంచి వలస పక్షులను తరమాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్​కు మద్దతుగా వివిధ పార్టీల నుండి  నుంచి కొంతమంది బీజేపీలో చేరిన వారిని ఈటల రాజేందర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Read more RELATED
Recommended to you

Latest news