నల్గొండ జిల్లాలో ప్రైవేట్ బస్సు బోల్తా.. ఒకరు మృతి.. 10 మందికి తీవ్రగాయాలు

-

పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన నల్గొండ జిల్లా చింతపల్లి శివారులో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

గుంటూరు జిల్లా వినుకొండలోని పెళ్లికి హాజరైన ఓ బృందం.. హైదరాబాద్​కు తిరుగు ప్రయాణమైంది. ఈ క్రమంలో చింతపల్లి సాయిబాబా గుడి సమీపంలోకి రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనా స్థలంలో క్షతగాత్రుల హాహాకారాలతో ఒక్కసారిగా అక్కడి వాతావరణం భీతావహంగా మారింది. స్థానికులు వెంటనే సహాయక చర్యలు మొదలుపెట్టి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. మరో 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.  నిద్రమత్తే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version