ఎన్ని కుట్రలు చేసినా ఖమ్మం సభకు వచ్చే జనాన్ని ఆపలేరు – పొంగులేటి

-

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జూలై రెండవ తేదీన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఖమ్మం లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు రాహుల్ గాంధీ ముఖ్యఅతిథిగా రానున్నారు. అయితే ఈ సభ కోసం దాదాపు 5 లక్షల మంది ప్రజలను తరలించేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది. ఎస్ ఆర్ గార్డెన్స్ పక్కన ఉన్న 100 ఎకరాల స్థలంలో ఈ సభకు సన్నాహాలు జరుగుతున్నాయి.

అయితే ఈ సభకు బీఆర్ఎస్ ఆటంకాలు కలిగించే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా సభకు వచ్చే జనాన్ని ఆపలేరని అన్నారు. తన చేరికతో జిల్లా కాంగ్రెస్ లో అసంతృప్తి ఉందని పుకార్లు పుట్టిస్తున్నారని మండిపడ్డారు. అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని చెప్పారు. ఇక తన చేరిక తరువాత బిజెపి, బిఆర్ఎస్ పార్టీల నుండి కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు ఉంటాయన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version