వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులపై హైకోర్టు సీరియస్ అయింది. అంధులను కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని మండిపడింది. వికలాంగులు బాధితులు కాదని.. అధికారులే నిజమైన అంధులు అని జస్టిస్ భీమపాక నగేశ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. ఉద్యోగాల నుంచి తొలగించడం పై 2017లో అంధ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఆ పిటిషన్ ను హైకోర్టు విచారించింది. అధికారుల పనితీరు, నిర్లక్ష్యం కారణంగా తాము ఎంతోత నష్టపోయారని వికలాంగులు ఆవేదన చెందారు. మరోవైపు రాస్ట్రంలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకుండా వారిని చిన్నచూపు చూస్తున్నారని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి నేతలు అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది దివ్యాంగులు అనేక సమస్యలతో అల్లాడిపోతూ దుర్భర జీవితాలు గడుపుతున్నారని.. తక్షణమే ప్రభుత్వం స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. వికలాంగుల పెన్షన్ రూ.6వేలకు పెంచుతామని.. రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని.. మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వికలాంగుల సంక్షేమ శాఖను వేరు చేసి ప్రత్యేక శాఖగా కొనసాగిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసి.. తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.