మద్దూరు కాలేజీలో దారుణం.. 90 మంది విద్యార్థినిలకు ఒకటే వాష్ రూమ్..!

-

తెలంగాణలోని ప్రభుత్వ కళాశాలల పరిస్థితి చాలా దారుణమనే చెప్పాలి. కేవలం ఒక్క కళాశాల మాత్రమే కాదు.. కొన్ని పాఠశాలల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మహిళా కళాశాల, గర్ల్స్ పాఠశాలల్లో విద్యార్థినిలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. కేవలం అమ్మాయిల కళాశాలలే కాదు.. అబ్బాయిలకు కూడా కొన్ని చోట్ల మరుగుదొడ్లు లేక బయటికి వెళ్లే పరిస్తితి నెలకొంది.

తాజాగా సిద్దిపేట జిల్లా మద్దూరు మహిళా జూనియర్ కళాశాలలో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. మద్దూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థినిలకు చెప్పుకోలేని బాధ నెలకొంది. కాలేజీ లోని 90 మంది విద్యార్థినిలకు ఒకటే వాష్ రూమ్ ఉండటంతో అవస్థలు పడుతున్నారు. ఆరు బయటికి వెళ్లాలంటే గంటల తరబడి క్యూ లైన్ లో బారులు తీరాల్సిన పరిస్థితి నెలకొంది. అబ్బాయిలు అయితే టాయిలెట్ కోసం గోడ దూకాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కాలేజిలో చాలా ఏళ్ల నుంచి ఇదే సమస్య ఉన్నా పట్టించుకోని అటు అధికారులు కానీ.. ఇటు ప్రజా ప్రతినిధులు కానీ పట్టించుకోవడం లేదు. మా సమస్యలను పట్టించుకొని మాకు న్యాయం చేయాలని విద్యార్థిని, విద్యార్థులు కోరుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version