హైదరాబాద్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓయో రూమ్ లో యువతి అనుమానస్పదంగా మరణించింది. వివరాల్లోకి వెళితే…. అనూష (26) బ్యూటీషియన్ గా గత కొంతకాలంగా పనిచేస్తుంది. భర్తతో విభేదాల కారణంగా విడిపోయి నల్లగండ్లలో తన తల్లిదండ్రుల వద్ద నివాసం ఉంటుంది. ఈనెల 23వ తేదీన సాయంత్రం 6 గంటలకు తన స్నేహితుల వద్దకు వెళుతున్నానని తల్లిదండ్రులకు చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.

ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో అనూష తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలేదు. ఆఖరికి అనూష రాయదుర్గం లోని ఓయో రూమ్ లో ఉరేసుకునే ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆత్మహత్యకు గల వివరాలను సేకరిస్తున్నారు. అనూష తానే ఆత్మహత్య చేసుకుందా లేకపోతే ఈ హత్యలో ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.