Patel Ramesh Reddy : నేను కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలో దిగడం ఖాయం

-

నేను కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలో దిగడం ఖాయం అని స్పష్టం చేశారు కాంగ్రెస్‌ నేత పటేల్ రమేష్ రెడ్డి. దామోదర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కోవర్ట్. మంత్రి జగదీష్ రెడ్డిని గెలిపించడానికే దామోదర్ రెడ్డికి టికెట్ ఇచ్చారని ఫైర్‌ అయ్యారు కాంగ్రెస్‌ నేత పటేల్ రమేష్ రెడ్డి. జగదీశ్ రెడ్డిని గెలిపించేందుకే నాకు టికెట్‌ ఇవ్వలేదని సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు పటేల్ రమేష్ కన్నీటి పర్యంతం అయ్యారు.

Patel Ramesh Reddy

సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాంరెడ్డి దామోదర్ రెడ్డిని ఖరారు చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. దీంతో టికెట్ ఆశించి బంగపడిన పటేల్ రమేష్ రెడ్డి పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేలు నేను గెలుస్తానని చెప్పినా దామోదర్ రెడ్డికి టికెట్ ఇవ్వడంలో ఆoతర్యమేంటి ? అని ప్రశ్నించారు పటేల్ రమేష్ రెడ్డి. పోయిన సారి అధిష్టాన బుజ్జగింపులతో తలొగ్గా.. ఈసారి తలొగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు సూర్యాపేట కాంగ్రెస్ నేత పటేల్ రమేష్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news