కొండా సురేఖకు పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ ఫోన్..

-

తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దూమారం రేపుతున్నాయి. అయితే.. ఈ తరుణంలోనే… మంత్రి కొండా సురేఖకు పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ ఫోన్ చేశారు.. సమంత, నాగచైతన్య వివాదంపై మాట్లాడారట మహేష్‌గౌడ్.. వివరణ ఇవ్వాలని కొండా సురేఖకు సూచించారట పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌. లేకపోతే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారట పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌.

PCC chief Mahesh Kumar Goud called Konda Surekha.

ఇక అటు సమంతపై వ్యాఖ్యలు అనుకోకుండా చేసినవి అంటూ వ్యాఖ్యానించారు మంత్రి కొండా సురేఖ. సమంత ట్వీట్‌ చూసి నేను చాలా బాధపడ్డాననన్నారు మంత్రి కొండా సురేఖ. నాకు జరిగిన అవమానం వేరొకరికి జరగకూడదనే.. నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా అంటూ క్లారిటీ ఇచ్చారు. కేటీఆర్‌ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. కేటీఆరే నాకు క్షమాపణ చెప్పాలి.. కేటీఆర్‌ వేసే పరువు నష్టం దావాను లీగల్‌గానే ఎదుర్కొంటానని ప్రకటించారు మంత్రి కొండా సురేఖ.

Read more RELATED
Recommended to you

Exit mobile version