రాష్ట్రంలో ప్రజలు ఆత్మగౌరవాన్ని కోల్పోతున్నారు – పొంగులేటి

-

ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు భేటీ ముగిసింది. అరగంటకు పైగా జరిగిన ఈ భేటీలో వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. వీరిద్దరినీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి పరిచయం చేశారు. ఈ భేటీలో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తంకుమార్, రేణుకా చౌదరి తదితరులు ఉన్నారు.

ఇక ఈ భేటీ అనంతరం ఏఐసీసీ కార్యాలయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణలో అవేమీ జరగడం లేదని విమర్శించారు. సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణ ఫలాలు ఎవరికి దక్కడం లేదని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఆత్మ గౌరవాన్ని కోల్పోతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ని కాదని కేసీఆర్ కి అధికారం ఇస్తే.. ఆయన ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం లేదని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version