జానారెడ్డి: BJP & BRS లు ఒక్కటే… తొందరలోనే ఇది బయటపడుతుంది..

-

రెండు రోజుల నుండి తెలంగాణకు చెందిన కీలక కాంగ్రెస్ నేతలు అందరూ ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ రోజు రాహుల్ గాంధీతో జరిగిన కీలక సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కొందరు నేతలు కాంగ్రెస్ కు తెలంగాణాలో మంచి రోజులు రానున్నాయన్నారు. సీనియర్ నేత జానా రెడ్డి మాట్లాడుతూ తెలంగాణాలో అధికార పార్టీ BRS ప్రజలను పిచ్చివాళ్లను చేస్తోందన్నారు. కేసీఆర్ బీజేపీ తో చేతులు కలిపి రాజకీయాన్ని చేస్తున్నారని ఆరోపించారు. పైగా ఈ విషయం త్వరలోనే బయటపడుతుందని చాలా నమ్మకంతోనే అన్నారు. జానారెడ్డి ఇంతటి స్ట్రాంగ్ కామెంట్ చేయడంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయిందని చెప్పాలి. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు సీరియస్ గా తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పార్టీకి ప్రజలు చరమగీతం పాడడం ఖాయం.

ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక ఏదైనా బలమైన వాస్తవం తెలిసిందా లేదా మామూలుగానే ఈ కామెంట్ చేశారా అన్నది తెలియాల్సి ఉంది. కాగా ఈ కామెంట్ పై అటు అధికార లేదా బీజేపీ నుండి ఎవరైనా స్పందిస్తారా చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version