పీకే వ్యూహం : సీఎం కేసీఆర్ పీఆర్వో గా సంజ‌య్ ఝా.. ఉత్త‌ర్వులు జారీ

-

దేశ రాజ‌కీయాల వైపు క‌న్నేసిన సీఎం కేసీఆర్.. కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటూ దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజా గా ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కార్యాల‌య పీఆర్వో గా సంజ‌య్ కుమార్ ఝా ను నియ‌మించారు. దీనికి సంబంధించిన ఉత్త‌ర్వులను రాష్ట్ర ప్ర‌భుత్వం జారీ చేశారు. బిహార్ రాష్ట్రానికి చెందిన సంజ‌య్ కుమార్ ఝా.. గ‌తంలో ప‌లు ఇంగ్లీష్ న్యూస్ పేప‌ర్స్ లల్లో ప‌ని చేశారు. రాజకీయాల్లో మంచి అనుభ‌వం ఉన్న సంజ‌య్ కుమార్ ఝా ను సీఎం కేసీఆర్ కార్యాల‌య పీఆర్వో గా నియ‌మించుకుంది.

సీఎం కేసీఆర్ పీఆర్వో గా నియ‌మించ‌డ్డ‌.. సంజ‌య్ కుమార్ ఝా రెండు ఏళ్ల పాటు ప‌ద‌విలో ఉండ‌నున్నారు. అయితే జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్ల‌డానికి సిద్ధం అవుతున్న సీఎం కేసీఆర్.. రాజ‌కీయ వ్యూహ‌క‌ర్తగా ప్ర‌శాంత్ కిశోర్ ను నియ‌మించుకున్నారు. దీంతో రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్.. సీఎం కేసీఆర్ ప‌లు సూచ‌న‌లు చేస్తున్నారు. తాజా గా పీఆర్వో నియ‌మ‌కం కూడా ప్ర‌శాంత్ కిశోర్ వ్యూహంలో భాగంగానే జ‌రిగింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version