నేడు పిఎం కిషాన్ నిధులు విడుదల !

-

రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. కిసాన్ సమ్మాన్ నిధులపై కీలక ప్రకటన చేసింది. ఇవాళ 14వ విడత కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా రైతులతో వర్చువల్ గా ప్రధాని మోడీ మాట్లాడనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చెప్పారు. ప్రతి నెల రెండో ఆదివారం కిసాన్ కా బాత్ కార్యక్రమం ఉంటుందని… సేవా కేంద్రాల లో పనిచేసే సిబ్బంది కి ఇప్పటికే శిక్షణ పూర్తి అయిందని చెప్పారు.

ఇవాళ్టి నుంచి అందుబాటులోకి సల్ఫర్ కోటెడ్ యూరియా రానుంది. అలాగే.. పీఎం కిసాన్ సేవా కేంద్రాలుగా ఎరువుల రిటైల్‌ దుకాణాలు మారనున్నాయి. ఎరువుల రిటైల్ షాప్స్ ఇవాళ్టి నుంచి ప్రధాన మంత్రి కిసాన్ సేవా కేంద్రాలు గా మారుతున్నాయని చెప్పారు. రైతులకు విత్తనాలు, ఎరువులు,ఇతర సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. వ్యవసాయ రంగానికి, రైతు సమాజానికి గౌరవం కలిగించే విధంగా మోడీ కార్యక్రమాలు నడుస్తున్నాయని… మాటల్లో కాకుండా చేతల్లో రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news