ప్రధాని పర్యటనలో స్వల్ప మార్పులు

-

ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 15వ తేదీ నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ కూడా ఖరారైంది. అయితే తాజాగా ఆ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మోదీ ఎన్నికల ప్రచారంలో స్వల్పమార్పులు చోటుచేసుకున్నాయని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

మొదట ఈనెల 16వ తేదీన ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తారని సమాచారం వచ్చినా.. ఇప్పుడు ఈనెల 15నే ఆయన రాష్ట్రంలో పర్యటిస్తారని బీజేపీ శ్రేణులు తెలిపాయి. 15వ తేదీన హైదరాబాద్‌కు వచ్చే ప్రధాని అదేరోజు మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో చేపట్టే రోడ్‌ షోలో పాల్గొననున్నట్లు వెల్లడించాయి. 16వ తేదీన నాగర్‌కర్నూల్‌లో, 18న జగిత్యాలలో బీజేపీ ఎన్నికల సభల్లో ప్రధాని పాల్గొంటారని పేర్కొన్నాయి. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో సుమారు గంటన్నరసేపు భారీ రోడ్‌ షో ఉంటుందని వివరించాయి. మొదట్లో 16, 18, 19 తేదీల్లో ప్రచారంలో ప్రధాని పాల్గొనాల్సి ఉన్నా తాజాగా 15, 16 తేదీలతో పాటు 18న ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version