స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. పూర్ణ చందర్ పై పోక్సో కేసు నమోదు ఐంది. నమ్మించి మోసం చేయడం.. ఆత్మహత్య కు ప్రేరేపించిన కేసులో.. 69 BNS, 108 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు చిక్కడపల్లి పోలీసులు. స్వేచ్ఛ కూతురు స్టేట్మెంట్ ఆధారంగా పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.

గతంలో తనతో కూడా పూర్ణచందర్ అసభ్యంగా ప్రవర్తించినట్లు స్టేట్మెంట్ ఇచ్చింది స్వేచ్ఛ కూతురు. అటు స్వేచ్ఛ తండ్రి షాకింగ్ కామెంట్స్ చేశారు. పూర్ణచందర్ చాలా దుర్మార్గుడు, అమ్మాయిల పిచ్చోడు అన్నారు స్వేచ్ఛ తండ్రి. ఎంతో మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు…. నా మనవరాలిని సైతం వేధించాడని బాంబు పేల్చాడు.