భద్రాచలానికి చంద్రబాబే శ్రీరామ రక్ష – కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంచలనం !

-

భద్రాచలం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిందని.. చంద్రబాబే దానికి శ్రీరామ రక్ష అంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పోదెం వీరయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. భద్రాచలంకు సీఎం కేసీఆర్ ఏం చేసిండని నిలదీశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేసిన అభివృద్దే భద్రాచలానికి శ్రీరామ రక్ష అని వెల్లడించారు. కరకట్ట నిర్మాణం చంద్రబాబు పుణ్యమని కొనియాడారు ఎమ్మెల్యే పోదెం వీరయ్య.

బిఆర్ఎస్ ప్రభుత్వం రాముడికి చేసింది ఏమీ లేదని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. కరకట్ట కోసం ఇస్తానన్న 1000 కోట్లు ఏమయ్యాయని సీఎం కేసీఆర్‌ పై ఫైర్‌ అయ్యారు ఎమ్మెల్యే పోదెం వీరయ్య. భద్రాచలం దేవస్థానం అభివృద్ధి కోసం రూ. 100 కోట్లు ఏవి… భద్రాచలం పట్ల కెసిఆర్ నిర్లక్ష్యం చూపిస్తున్నారని ఆగ్రహించారు. అసలు బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలకు సిగ్గు వుందా అని నిలదీశారు. ప్రతి పక్ష ఎమ్మెల్యేల దిష్టి బొమ్మలు దగ్ధం చేసే సాంప్రదాయం ఎక్కడ ఉందని ప్రశ్నించారు ఎమ్మెల్యే పోదెం వీరయ్య.

Read more RELATED
Recommended to you

Latest news