కేసీఆర్‌ పై పొంగులేటి సంచలన వ్యాఖ్యలు.. నాకు సీటు కూడా ఇవ్వలేదు !

-

నాకు ఇచ్చిన ఒక్క హామీని కేసీఆర్‌ నెరవేర్చలేదు..నాకు సీటు కూడా ఇవ్వలేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇవాళ మరో ఆత్మీయ సభన పొంగులేటి ఏర్పాటు చేసి.. ప్రసంగించారు. రాజకీయ ప్రస్థానం మొదలు అయ్యాక మధిర తో మంచి అనుబందం వుందన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

వైఎస్ఆర్ రాష్ట్ర అధ్యక్ష పదవినీ వదిలి కేసీఆర్, కెటిఆర్ ల ను నమ్మి, బీఆర్ఎస్ లో చేరానని తెలిపారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. బీఆర్ఎస్ లో చేరిన తరువాత ఒక్క వాగ్ధానం నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాభిమానం లేని వారు, ఓడిపోయిన అభ్యర్థులకు కారణం నేను అంటూ నాకు సీటు ఇవ్వలేదని పేర్కొన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అదే రోజు పార్టీలో చేరిన వ్యక్తికి ఎంపీ సీటు ఇస్తే, నేను పార్టీ కోసమే పని చేశానన్నారు. ఏడున్నర సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో పని చేశాను…అధికార మదంతో నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టారని ఫైర్ అయ్యారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version