చాక్ పౌడర్, గంజితో నకిలీ మాత్రలు తయారీ.. పోలీసులు ఎంట్రీ..!

-

రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో నకిలీ మందులు తయారు చేస్తున్న బృందాన్ని పోలీసులు పట్టుకున్నారు. చాక్ పౌడర్, గంజితో మెడిసిన్స్ తయారు చేస్తున్న కేటుగాళ్ల గుట్టురట్టయింది. పక్కా సమాచారంతో మంగళవారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా మెడ్లైఫ్ సైన్సెస్ కంపెనీ పేరుతో మందుల విక్రయాలు జరుపుతున్నట్లు గుర్తించారు. మొత్తం రూ.33 లక్షల విలువైన మందులను సీజ్ చేశారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ఈ సందర్భంగా తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు మాట్లాడుతూ.. ఫేక్ ప్రకనటలు చూసి మోసపోవద్దని సూచించారు. టీవీల్లో, సెల్ఫోన్లలో ప్రకటనలు చూసి ఈ మధ్య టాబ్లెట్స్ కొనుగోలు చేయడం కామన్ అయిపోయిందని గుర్తుచేశారు. వీటిలో చాలా పెద్ద మోసం దాగుందని అనుమానం వ్యక్తం చేశారు. గుర్తింపు పొందిన మెడికల్ షాపుల్లోనే మాత్రలు కొనుగోలు చేయాలని సూచించారు. నకిలీ మెడిసిన్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version