ప్రత్యేక హెలికాప్టర్ లో ధర్మశాలలో ల్యాండ్ అయిన హిట్ మ్యాన్..!

-

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి తన విధుల్లో జాయిన్ అయ్యాడు. నాలుగో టెస్ట్ అనంతరం లభించిన విరామంలో వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరయ్యాడు రోహిత్ శర్మ. తిరిగి టీమిండియా వద్దకు చేరుకున్నాడు.

ఇంగ్లండ్ తో జరుగబోయే ఐదో టెస్ట్ మ్యాచ్కు వేదిక అయిన ధర్మశాలలో హిట్ మ్యాన్ ప్రత్యేక హెలికాప్టర్లో ల్యాండ్ అయ్యాడు. మ్యాచ్కు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండటంతో బీసీసీఐయే స్వయంగా రోహిత్కు హెలికాప్టర్ను అరేంజ్ చేసినట్లు తెలుస్తుంది. మార్చి 7 నుంచి ధర్మశాలలో ఇంగ్లండ్తో ఐదో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్ ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకుంది.

గుజరాత్ లోని జామ్ నగర్ లో అనంత్ అంబానీ రాధిక మర్చంట్ల ముందస్తు వివాహా వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్కు రోహిత్ సతీసమేతంగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాలకు చెందిన అన్ని రంగాల సెలబ్రిటీలు హాజరయ్యారు. వీరందరిలో భారత క్రికెటర్లు ప్రత్యేక ఆకర్శనగా నిలిచారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version