యువత భవిత కోసం ఈ అఫిడవిట్ మీద మీ బంగారు సంతకం పెట్టండి కేసీఆర్ గారు – వైఎస్ షర్మిల

-

రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోసం తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. టీఎస్పీఎస్సీ పరీక్షలు ఈసారైనా కచ్చితంగా, పటిష్టంగా, సమర్థవంతంగా, ఎటువంటి లీకులు లేకుండా నిర్వహిస్తామని హామీ ఇవ్వాలంటూ.. ఈ ఆపిడబిట్ మీద సంతకం పెట్టాలని సీఎం కేసీఆర్ ని కోరారు షర్మిల.

“కేసీఆర్ గారు తెలంగాణ సీఎంఓ, పదవులైనా, బతుకైనా అన్నీ తెలంగాణ కోసమే అని మహా బిల్డప్ ఇస్తారు కదా, మరి బంగారు తెలంగాణలో బుడగల్లా పేలిపోతున్న యువత భవిత కోసం ఈ అఫిడవిట్ మీద మీ బంగారు సంతకం పెట్టండి. TSPSC పరీక్షలు ఈసారి ఖచ్చితంగా పటిష్టంగా, సమర్థవంతంగా, ఎటువంటి లీకులు లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తామని, ఇకపై ప్రశ్నాపత్రాల లీకులు ఉండవని ఇప్పుడైనా నిరాశ నిండిన విద్యార్థులకు భరోసా ఇస్తారా లేదా? పిల్లలకోసం ఆలోచిస్తున్నవారైతే, వారి బతుకులతో ఇక మీ సర్కారు ఎటువంటి ఆటలు ఆడదనే ధైర్యం కలిగిద్దామనుకుంటున్నారంటే, వెంటనే సంతకం పెట్టండి.

80 వేల పుస్తకాలు చదివి, ఏకంగా రాజ్యాంగాన్నే తిరగరాద్దామన్న మీకు, ఒక సీఎం సంతకం పెట్టిన అఫిడవిట్ పవర్ ఏమిటో, అది ఇచ్చే ధైర్యం ఏమిటో కొత్తగా చెప్పక్కర్లేదు అనుకుంటా. ఇక తెలంగాణాలో ఎప్పటికీ పేపర్ లీకులు ఉండవు, ఇది కేసీఆర్ మాట అని ఒక సంతకంతో చెప్పేయండి” అంటూ సోషల్ మీడియా వేదికగా నిలదీశారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Exit mobile version