కడియం శ్రీహరిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి – ఎమ్మెల్యే రాజయ్య

-

కడియం శ్రీహరిని బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని స్టేషన్‌ ఘణ్‌ పూర్‌ ఎమ్మెల్యే రాజయ్య ఫైర్‌ అయ్యారు. స్టేషన్ ఘన్‌పూర్ బీఆర్ఎస్ పార్టీలో మరోసారి ముసలం చోటు చేసుకుంది. తాజాగా సీనియర్ బీఆర్ఎస్ లీడర్ కడియం శ్రీహరి మీద తీవ్ర ఆరోపణలు చేశారు స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య.

కడియం శ్రీహరి దేవాదుల సృష్టికర్త కాదని… ఎన్ కౌంటర్ల సృష్టికర్త అంటూ రెచ్చిపోయారు. 2014 నుంచి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కడియం శ్రీహరిని బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్‌ చేశారు ఎమ్మెల్యే రాజయ్య. కడియం శ్రీహరిని బీఆర్ఎస్ పార్టీలో ఉంటే.. ఇంకా నష్టాలు వచ్చే ఛాన్స్‌ ఉందంటూ వ్యాఖ్యానించారు. దీనిపై ఇకనైనా.. పార్టీ అధిష్టానం స్పందించి.. కడియం శ్రీహరిని బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్‌ చేయాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news