సొంత పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్. చావడానికి అయినా సిద్ధం.. చంపాడనికి అయినా సిద్ధం అంటూ సంచలన ప్రకటన చేశారు రాజాసింగ్. తాజాగా తన పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ… గత ఎన్నికల్లో మన పార్టీ వారు ఎవరు కోవర్ట్ లుగా పని చేశారో ప్రేమ్ సింగ్ రాథోడ్ నాకు చెప్పారన్నారు.
![Rajasingh gave a warning to his own party leaders](https://cdn.manalokam.com/wp-content/uploads/2023/10/BJP-will-lift-the-suspension-on-Rajasingh.jpg)
ఈ సారి అలా చేస్తే వదిలే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడి నుంచి అక్కడకు సమాచారం ఇస్తే అక్కడ వారు ఇక్కడకి సమాచారం ఇస్తారు మరిచిపోకండని హెచ్చరించారు. ఈ ఎన్నిక నాకు జీవన్మరణ సమస్య అన్నారు. చావడానికి భయపడను … చంపడానికి భయపడనని హెచ్చరించారు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్. కాగా… బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్… ఈ సారి కూడా గోషా మహల్ నుంచి బరిలో ఉన్న సంగతి తెలిసిందే.