రోహిత్ శర్మ టాస్ ఫిక్సింగ్ చేశారు: పాక్ మాజీ పేసర్

-

రోహిత్ శర్మ టాస్ ఫిక్సింగ్ చేశారని సంచలన ఆరోపనలు చేశారు పాక్ మాజీ పేసర్ సికిందర్ బక్త్. వరల్డ్ కప్ సెమీస్ లో న్యూజిలాండ్ పై టీమిండియా గెలుపొందడంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే పాకిస్తాన్ మాజీ పేసర్ సికిందర్ బక్త్ మాత్రం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ ను ఫిక్సింగ్ చేశారని ఓ ఇంటర్వ్యూలో ఆరోపించారు.

pakistan cricketer sikander bakht accused rohit sharma for toss
pakistan cricketer sikander bakht accused rohit sharma for toss

రోహిత్ పరిధికి మించి ప్రత్యర్థి కెప్టెన్ కు దూరంగా నాణేన్ని విసిరారని, ఇరుజట్ల కెప్టెన్స్ చెక్ చేయకముందే భారత్ టాస్ గెలిచినట్లు ప్రకటించడం సరికాదని పేర్కొన్నారు. అటు భారత్-న్యూజిలాండ్ సెమీ ఫైనల్ ఫిక్స్ అయిందంటూ పాకిస్తాన్ నటి సెహార్ షిన్వారి సంచలన ఆరోపణలు చేసింది. ‘భారత టీమ్ ఆటగాళ్లు మంచి నటులు. ఈ మ్యాచ్ ఫిక్స్ అయిందని వారికి తెలుసు. కానీ నిజంగా మ్యాచ్ ఆడుతున్నట్లు నటించారు’ అని ట్వీట్ చేసింది. ‘ఇండియన్ టీం మరోసారి ఫైనల్ కు వెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. భారత్ అన్నింటిలో మన దేశం కంటే ఎందుకు ముందు ఉంది?’ అని అక్కసు వెళ్లగక్కింది.

Read more RELATED
Recommended to you

Latest news