రాంజీ గోండు పోరాటం మరువం : సీఎం రేవంత్ రెడ్డి

-

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని మోడీ, కేసీఆర్ విషం కక్కుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆదిలాబాద్ లో నిర్వహించిన జన జాతర సభలో ఆయన మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లాలో రాంజీ గోండు చేసిన పోరాటాన్ని మరువం అన్నారు.  కాంగ్రెస్ ను ఓడించాలని మోడీ, కేసీఆర్ కక్ష కట్టారని ఫైర్ అయ్యారు. మోడీ, కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలేనని విమర్శించారు. డిసెంబర్ లో ఒక దొంగను ఓడగొట్టామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన సీసీఐ పరిశ్రమను మోడీ, కేడీ కలిసి మూయించారు.

త్వరలోనే తిరిగి సీసీఐ పరిశ్రమను రీ ఓపెనింగ్ చేయిస్తామని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఐదింటిని అమలు చేశాం.. త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తామని తెలిపారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం.. పేదలకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నామన్నారు. పేదళ ఇళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వెలుగులు నింపుతోందని.. ఈ వెలుగులు ఆపాలనే కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version