BRS పార్టీకి మరో షాక్..కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే !

-

 

సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రంలోని 119 స్థానాలకు గానూ 115 స్థానాల్లో బీఆర్‌ఎస్‌ నుంచి బరిలో ఉండే అభ్యర్థుల లిస్ట్‌ను రెడీ చేశారు. అంతేకాకుండా.. 7గురు సిట్టింగ్‌లను మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు.ఈ ఏడుగురిలో ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ కూడా ఉన్నారు. ఈ తరుణంలోనే.. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు ఎమ్మెల్యే రేఖా నాయక్.

రేఖా నాయక్ బాటలోనే బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కూడా వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. బోథ్ టికెట్ అనిల్ జాదవ్ కు కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో బాపురావు అసంతృప్తికి గురయ్యారు. ఎన్నికల బరిలో నిలవాల్సిందే అంటూ అనుచరులు ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో బాపురావు పార్టీ మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అనుచరులతో భేటీ అనంతరం ఏ పార్టీలో చేరుతారనే దానిపై ఆయన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఆయనకు కాంగ్రెస్ లోకి వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version