కొండగట్టు అంజన్నా.. మా ఆర్సీబీ కప్పు కొట్టాలి

-

ఐపీఎల్ మ్యాచ్లు తుది దశకు చేరుకున్నాయి. ఎన్నడూ లేని విధంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈసారి ఐపీఎల్ మ్యాచ్ లలో మంచి విజయాన్ని సాధించింది. క్వాలిఫైయర్ మ్యాచ్లో పంజాబ్ జట్టును ఓడించి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫైనల్స్ కు దూసుకెళ్ళింది. ఫైనల్స్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడనుంది. ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ జూన్ 3న జరగనుంది.

RCb fan offers special prayers to win IPL 2025 trophy at kondagattu hanuman temple
RCb fan offers special prayers to win IPL 2025 trophy at kondagattu hanuman temple

ఈ క్రమంలోనే ఈసారి ఆర్సిబి జట్టు ఎలాగైనా విజయం సాధించాలని, కప్ అందుకోవాలని ఆర్సిబి జట్టు యాజమాన్యంతో పాటు అభిమానులు సైతం కోరుకుంటున్నారు. ఆర్సిబి జట్టు ఎలాగైనా గెలవాలని కొంతమంది పూజలు సైతం నిర్వహిస్తున్నారు. తాజాగా ఆర్సిబి అభిమాని కొండగట్టు ఆలయంలో తన కోరికను చిట్టిలో రాసి హుండీలో వేశారు. “ప్లీజ్ దేవుడా ఈ సంవత్సరం ఆర్సిబి ట్రోఫీ ఎలాగైనా గెలవాలి. ఈ సారి కప్ మనదే” అంటూ ఆ చిట్టిలో రాశారు. చాలామంది ఆర్సిబి అభిమానులు ఈసారి ఎలాగైనా ఆర్సిబి జట్టు విజయం సాధించాలని కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news