జూన్ 15 లోపు తల్లికి వందనం డబ్బులు – ఏపీ మంత్రి

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం అనేక పథకాలను అమలులోకి తీసుకువస్తున్నారు. ఆ పథకాలలో తల్లికి వందనం పథకం ఒకటి. ఈ క్రమంలోనే తల్లికి వందనం పథకం అమలు విషయంపై హోం మంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కూల్లు రీఓపెన్ అయిన అనంతరం జూన్ 15వ తేదీలోపు డబ్బులను తల్లుల అకౌంట్లోకి వేస్తామని అనిత వెల్లడించారు.

anitha

అనకాపల్లి జిల్లా ఉద్దండపురంలో మాట్లాడుతూ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రూ. 15000 చొప్పున అందిస్తామని అనిత వెల్లడించారు. అంతేకాకుండా జూన్ 12వ తేదీ నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తామని గతంలోనే చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ క్రమయంలోనే తాజాగా అనిత స్పందిస్తూ 15వ తేదీ లోపు డబ్బులను అకౌంట్లోకి జమ చేస్తామని వెల్లడించారు. ఈ విషయం తెలిసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు. ఈ పథకం చాలా మంది నిరుపేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news