రియల్ ఎస్టేట్ కొంప ముంచిందే కేసీఆర్ : జగ్గారెడ్డి

-

రియల్ ఎస్టేట్ కొంప ముంచిందే కేసీఆర్ అని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కంటే ముందే రియల్ ఎస్టేట్ ను కేసీఆర్ ప్రభుత్వం నాశనం చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే రియల్ కుప్పకూలిపోయింది. ఎన్నికలకు ముందు మోడీ, కేసీఆర్ నిర్ణయాల వల్ల రియల్ ఎస్టేట్ కూలిపోయిందని తెలిపారు. ప్రతిపక్ష నాయకులు ముఖ్యమంత్రి అవుతారా..? అని ప్రశ్నించారు.

కేసీఆర్ అనుభవజ్ఞులు.. అసెంబ్లీకి రావడం లేదు. విచిత్రం ఏంటంటే.. స్పీకర్ గారే ప్రతిపక్ష నేతను అడిగారు. ఇంట్లోనుంచి బయటికి రారు. ఎవరు వచ్చినా మీ ఇంటి వద్దకే రావాలి. అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ మాట్లాడుతున్నారు. సీఎం.. ప్రతిపక్ష నేతను సభకు రండి అని అడుగుతున్నారు. సీఎంగా ఉంటే.. అసెంబ్లీకి వస్తావు.. ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాడా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ మాటల్లో ఉన్న బలం.. చేతల్లో లేదు. గాలికే కొట్టుకుపోతాడు కేసీఆర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version