అమిత్ షా పర్యటనపై రేగ వివాదస్పద వ్యాఖ్యలు

-

కేంద్ర హోం శాఖ మంత్రి వర్యులు, బీజేపీ అగ్ర నేత అమిత్ షా ఖమ్మం జిల్లాలోఇవాళ పర్యటిస్తున్నారు. అయితే… కేంద్ర హోం శాఖ మంత్రి వర్యులు, అమిత్ షా ఖమ్మం జిల్లా పర్యటనపై రేగ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ విప్ రేగ కాంతారావు సోషల్ మీడియా వేదిక అమిత్ షా పై కామెంట్స్ చేశారు.

ఐదు గ్రామాల పంచాయతీల సంగతేంటి.. తెలంగాణలో కలుపుతారా లేదా అమిత్ షా భద్రాద్రి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాముని భూములకు రక్షణ కల్పిస్తారా లేదా ఖమ్మం వేదికగా అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. బిజెపికి భద్రాద్రి రామయ్య పైన చవితి తల్లి ప్రేమ రామునికి సమాధానం చెప్పలేకనే అమిత్ షా భద్రాద్రి పర్యటన బంద్‌ అయినట్లు చురకలు అంటించారు ప్రభుత్వ విప్ రేగ కాంతారావు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version