తెలంగాణ కి 25 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని మోడీకి రేక్వెస్ట్ : డిప్యూటీ సీఎం భట్టి

-

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమంత్రి అమిత్ షాను కలిశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గోదావరి పరిసరాల్లోని బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలని కోరామన్నారు. వేలం లేకుండా సింగరేణికి బొగ్గు గనులను కేటాయించాలని కోరామన్నారు. ఇంకా.. రాష్ట్రానికి IIM ఇవ్వాలని ప్రధాని మోదీని కోరామన్నారు. ఇంకా ఐటీఆర్‌ ప్రాజెక్టును పునరుద్ధరించాలని అడిగారు. ఇంకా.. కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి కృషి చేయాలని ప్రధానిని కోరామన్నారు. ఇంకా భద్రాచలం సమీపంలో ఏపీలో విలీనం చేసిన 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని కోరినట్లు చెప్పారు. ఇంకా 29 మంది ఐపీఎస్ అధికారులను తెలంగాణకు కేటాయించాల్సి ఉందని ప్రధానికి తెలిపామన్నారు. ఈ కేటాయింపు త్వరలో పూర్తి చేయాలని కోరినట్లు చెప్పారు.

వేలం లేకుండా సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని రిక్వెస్ట్ చేశామని తెలిపారు. రాష్ట్రానికి ఐఎంఎం ఇవ్వాలని కోరడంతో పాటు గత ప్రభుత్వం సాంక్షన్ చేసిన ఐటీఆర్ ప్రాజెక్ట్ ని పునరుద్దరించాలని విజ్ఞప్తి చేశామన్నారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కృషి చేయాలని అడిగామని తెలిపారు. జిల్లాలకొక నవోదయ సైనిక్ స్కూల్ ఏర్పాటు చేశాయని రిక్వెస్ట్ చేశామన్నారు. విజభన చట్టంలోని పెండింగ సమస్యలను త్వరగా పరిష్కారించాలని కోరామన్నారు. రాష్ట్ర రహదారులను జాతీయ హై వేలుగా మార్చాలని ప్రధానిని కోరామని తెలిపారు. తెలంగాణను డ్రగ్ ఫ్రీ స్టేట్ గా మార్చాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కోరామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version