రేవంత్ రెడ్డి చంద్రబాబు ఏజెంట్ – పువ్వాడ అజయ్

-

టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులను సంక్షోభంలోకి నెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో పగటిపూట కరెంట్ ఉండేదే కాదని విమర్శించారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డి చంద్రబాబు ఏజెంట్ అని.. ఆయన టిడిపి ప్రోడక్ట్ అని ఆరోపించారు. రైతులకు మూడు గంటల కరెంట్ వ్యాఖ్యలను మేనిఫెస్టోలో పెట్టే దమ్ము కాంగ్రెస్ కి ఉందా..? అని ప్రశ్నించారు పువ్వాడ. కాంగ్రెస్ ఇక అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని అన్నారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ పాతాళంలోకి వెళ్లిందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version