బిజెపి కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి సవాల్

-

బీజేపీ కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి కి సవాల్ విసిరారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ధరణి లో ఉన్న కంపనీలు ఏంటో బయట పెట్టాలన్నారు. కేసీఆర్ అంటే.. కిషన్ చెంద్రశేఖర్ రెడ్డి అని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోందని ఎద్దేవా చేశారు. ధరణిని కొనసాగిస్తాం అని బండి సంజయ్ చెప్పాడన్నారు. కేటీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాతే తెలంగాణ బిజెపిలో మార్పులు చేర్పులు చేపడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ వాళ్లకి అనుకూలంగానే మార్పులు చేసుకున్నారని ఆరోపించారు.

బీసీ నాయకులకు సమావేశాలు పెట్టుకోమని మేమే చెప్పేయమన్నారు. ముందు ప్రకటించే సీట్లు బీసీలవే ఉంటాయన్నారు. అధిష్టానం కూడా నాకు అదే సూచన చేసిందన్నారు. బిజెపిని నమ్మి ఈటెల రాజేందర్ మళ్లీ మోసపోయాడని.. ప్రచార కమిటీ అని చెప్పి ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఈటెలకి ప్రాణహాని ఉందని ఎమ్మెల్సీ పేరు చెప్పారని.. కానీ ఎమ్మెల్సీ మీద కేసు పెట్టలేదు అన్నారు రేవంత్ రెడ్డి. ధరణిపై, కెసిఆర్ అక్రమాలపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version