ఏపీ బీజేపీ కార్యాలయంలో ఆసక్తికర ఘటన.. స్వీట్లు పంపిణీ చేసిన సోము వీర్రాజు

-

అమరావతి: నేడు బిజెపి కార్యాలయంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు నిర్వహించారు. శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలకు హాజరయ్యారు బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. అధ్యక్ష పదవి నుండి సోమును తప్పించాక తొలిసారి ఆయన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము మాట్లాడుతూ.. శ్యాం ప్రసాద్ ముఖర్జీ జీవితం స్ఫూర్తిదాయకమైందని అన్నారు. నెహ్రూ కేబినెట్ లో శ్యాంప్రసాద్ ముఖర్జీ కేంద్రమంత్రిగా పనిచేశారని.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ నీ పాక్ నుండి విడిపించాలని నెహ్రూ నీ ఆయన ఎన్నోసార్లు కోరారు అని తెలిపారు.

ఆర్టికల్ 370 నీ ప్రధాని మోదీ తొలగించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా బిజెపి కార్యాలయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కొత్త అధ్యక్షురాలు పురందేశ్వరి నియామకాన్ని స్వాగతిస్తున్నామని ప్రధాన కార్యదర్శి వేటకూరి సూర్యనారాయణ రాజు అన్నారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేతుల మీదుగా కార్యకర్తలకు స్వీట్ల పంపిణీ చేశారు. సోము వీర్రాజుకు స్వీట్ తినిపించారు నేతలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version