బండి సంజయ్‌ను తొలగించి బీజేపీ సెల్ఫ్ గోల్ వేసుకుంది: రేవూరి

-

బండి సంజయ్‌ను తొలగించి బీజేపీ సెల్ఫ్ గోల్ వేసుకుందని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత రేవూరి ప్రకాశ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తాను పరకాల నుంచి పోటీ చేయనున్నట్టు మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రకటించారు. రేపు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ ‘గత నాలుగు నెలలుగా బిజెపి గ్రాఫ్ పడిపోయింది. గ్రూప్ పాలిటిక్స్ పెరిగిపోయాయి.

Former Narsampet MLA Revuri Prakash Reddy joins Congress

ఏకాభిప్రాయం లేదు. బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి బిజెపి సెల్ఫ్ గోల్ వేసుకుంది. బిజెపిని ఆయన గ్రామాల్లోకి తీసుకెళ్లారు’ అని వాక్యానించారు. కాగా, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ లో చేరనున్నారు. నిన్న వరంగల్లో ఆయనతో టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, తుమ్మల, పొంగులేటి భేటీ అయ్యారు. పార్టీలో చేరాలని ఆహ్వానించగా అందుకు రేవూరి అంగీకరించారు. ఢిల్లీలో ఆయన హస్తం కండువా కప్పుకొనున్నారు. ఎన్నికల్లో పరకాల నుంచి పోటీచేసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version