RYTHU BHAROSA: తెలంగాణ రాష్ట్ర రైతులకు శుభవార్త. తెలంగాణలో 15 ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు విడుదల అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయం నిధుల జమ కొనసాగుతోంది.

సోమవారం 15 ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇందు కోసం రూ.513 కోట్లు విడుదల చేశామని చెప్పారు. దీంతో ఇప్పటివరకు 67.01 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.8,284 కోట్ల జమ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
- తెలంగాణలో 15 ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు విడుదల
- ఇందుకోసం మరో రూ 513.83 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
- ఇప్పటివరకు 67.01 లక్షల మంది రైతుల ఖాతాల్లో
రూ.8284.66 కోట్లు జమ