తెలంగాణ రాష్ట్ర రైతులకు అలర్ట్. తెలంగాణలో రైతు భరోసా డబ్బులు పొందని వారికి మరో అవకాశాన్ని ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రైతు భరోసా డబ్బులు పొందని వారు ఈనెల 20 లోపు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీనికోసం ఏఈఓ నుంచి ఫామ్ తీసుకొని వివరాలను నమోదు చేసుకోవాలి. rythubharosa.telangana.gov.in/ నుంచి కూడా ఈ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఈ ఫామ్ తో పాటు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు సేవింగ్ ఖాతా కాపీ జిరాక్స్ లను జత చేసి స్థానిక ఏఈఓకు అప్పగించాలి. ఒకవేళ వీటిని అప్పగించిన రైతులు అర్హులైతే జిల్లా స్థాయి అధికారులకు పంపించి రైతు భరోసా నిధులు పడేవిధంగా చర్యలు చేపడతారు. గత నాలుగు రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లలో జమ అవుతున్నాయి. దీంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.