ప్రముఖ సినీ నటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమెకు విపరీతంగా అభిమానులు ఉన్నారు. ఈ చిన్నది తెలుగులో అనేక సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా తన సత్తాను చాటుకుంది. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లు, సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం సమంత ముంబైలో ఉంటున్నారు. సినిమా షూటింగ్స్ కారణంగా తాను అక్కడ ఉంటున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ క్రమంలోనే సమంత ముంబైలో జిమ్ కి వెళ్లారు.

జిమ్ నుంచి బయటికి వస్తున్న సమయంలో సమంత కాస్త టెన్షన్ గా ఫోన్లో మాట్లాడుకుంటూ అటు ఇటు తిరుగుతోంది. దీంతో అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీయడానికి ప్రయత్నించారు. కానీ సమంత ముందుగానే ఫోటోలు వద్దని చెప్పింది. అయినా వారు వినకుండా అలానే ఫోటోలు తీయడంతో సమంత కాస్త సీరియస్ అయింది. ఆపండి అంటూ సీరియస్ గా కారు లోపలికి వెళ్లి కూర్చుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఈ వీడియోని చూసి చాలామంది సీరియస్ అవుతున్నారు. తనకు కాస్త ప్రైవసీ ఇవ్వచ్చు కదా అని తన అభిమానులు మండిపడుతున్నారు. అంత కోపం తెప్పించడం అవసరమా వద్దని చెప్పినా కూడా ఫోటోలు తీయడం ఎందుకు అని అంటున్నారు.