రెండు తెలుగు రాష్ట్రాలను ఒకేవిధంగా చూడండి.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్ రిక్వెస్ట్..!

-

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల భారీ వర్షాలు కురిసి అతలా కుతలం అయిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వానికి అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని లేఖలు రాశాయి. ఈ మేరకు నిన్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించారు. ఇవాళ ఆయన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో పర్యటించారు. అనంతరం హైదరాబాద్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలువురు మంత్రులతో భేటీ అయ్యారు.

ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి కీలక సూచన చేశారు. రాష్ట్రంలో ఒకేరోజు అత్యధికంగా దాదాపు 40సెం.మీకి పైగా వర్షం కురిసింది. వరద ప్రభావిత గ్రామాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రోడ్లు, ఇల్లు, బ్రిడ్జీలు దెబ్బ తిన్నాయి. తీవ్ర పంట నష్టం జరిగిందని కేంద్ర మంత్రికి వివరించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వరద నష్టాన్ని ఒకేవిధంగా చూడాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version