రేపు కేసీఆర్ ఇలాఖాలో షర్మిల పర్యటన..!

-

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు షర్మిల. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఉదయం 10 గంటలకు గజ్వేల్  నియోజకవర్గంలోని జగదేవ్ పూర్ మండలం తీగల్ గ్రామానికి చేరుకోనుంది.  ఇటీవల దళిత బంధు పథకం అర్హులకు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేసిన తీగుల్ గ్రామప్రజలను కలిసి వివరాలను అడిగి తెలుసుకోనున్నారు షర్మిల. 

తెలంగాణలో అందరికీ మేలు చేసేందుకు వైఎస్సార్ ఎంతో కృషి చేశారు. సొసైటీలో భూముల కేసు సుప్రీంకోర్టులో గెలిచినా ఇండ్ల స్తలాలు ఇవ్వడానికి చిత్తశఉద్ది లేదన్నారు. ఇటీవల జర్నలిస్టులను సైంటీస్టులతో పోల్చిన కేసీఆర్ జర్నలిస్టులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు అసలు ఎంత మందికి దళిత బంధు అందింది ? దళిత బంధుతో ఎవరు లబ్ది పొందుతున్నారనే వివరాలను రేపు మీడియాకు వివరించనున్నారు షర్మిల. 

Read more RELATED
Recommended to you

Exit mobile version