మా జాతులను కించ పరిస్తే అణగతొక్కుతాం – మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

-

మా జాతులను కించ పరిచే విదంగా మాట్లాడితే రాజకీయంగా అణగతొక్కుతామని తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హెచ్చరించారు. రవీంద్రభారతిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహరాజ్ జయంతి వేడుకలు జరిగాయి. బిసి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అధికారికంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… గతంలో సర్వాయి పాపన్న వేడుకలు రవీంద్రభారతిలో నిర్వహించాలి అంటే అడ్డుకున్నారని.. ఇప్పుడు ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుందని వెల్లడించారు. బిసి లు ఎదుగుతుంటే అణిచి వేసే కుట్రలు ఇంకా అక్కడక్కడ జరుగుతున్నాయని.. ఉన్న ముగ్గురు బిసి మంత్రులపై కోవర్టు ఆపరేషన్ చేస్తున్నారన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బిసి లకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నాడని.. మా వృత్తుల పట్ల అవహేళన చేసిన వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

Read more RELATED
Recommended to you

Latest news