RTC MD సజ్జనార్‌కు విద్యార్థుల బహిరంగ లేఖ !

-

Students open letter to RTC MD Sajjanar: ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు లేఖ రాసారూ తెలంగాణ విద్యార్థులు. ఫుడ్ బోర్డు మీద వేలాడుతున్న తమకు భరోసా కల్పించేదేవరని సజ్జనార్‌కు తమ ఆవేదన వ్యక్తం చేసిన విద్యార్థులు.. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు లేఖ రాశారు. షాద్ నగర్ – ఆమన్ గల్ రూట్లో బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు లేఖ రాశారు విద్యార్థులు.

షాద్ నగర్ – ఆమన్ గల్ రూట్లో గతంలో 10 బస్సులు నడిస్తే ఇప్పుడు 4 బస్సులే నడుపుతున్నారని లేఖలో వివరించారు. బస్సుల సంఖ్యను పెంచాలి అంటూ సజ్జనార్‌కు లేఖ రాశారు విద్యార్థులు. డిగ్రీ కాలేజీలు దూరంగా ఉండడంతో ఆర్టీసీ బస్ పాస్ పరిమితి 35 KM సరిపోవట్లేదని 45 KM లకు పెంచాలని లేఖలో విద్యార్థి మధు తెలిపారు. షాద్ నగర్ – మహబూబ్ నగర్ రూట్లో పల్లే వెలుగు బస్సులు నడపాలని సజ్జనార్‌కు లేఖ రాశారు. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news