సీఎం కేసీఆర్, జగన్ జాతకాలు అద్భుతం – స్వరూపానందేంద్ర

-

సీఎం కేసీఆర్, జగన్ జాతకాలు అద్భుతం అన్నారు స్వరూపానందేంద్ర. విశాఖ శ్రీ శారదాపీఠంలో ఉగాది వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పీఠం గంటల పంచాంగాన్ని ఆవిష్కరించారు స్వరూపానందేంద్ర. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర మాట్లాడుతూ… కాల సర్ప దోషం కారణంగా మూడేళ్ళుగా దేశం ఇబ్బందులు పడింది…ఈ ఏడాది చతుర్ గ్రహ కూటమితో కొత్త సంవత్సరం ప్రారంభమవుతోందన్నారు.

దీనివల్ల దేశానికి ఇబ్బందులు తప్పవని.. ప్రధాని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జాతకాలు బాగుండటంతో కొంతవరకు ఇబ్బందులు తొలగుతాయని చెప్పారు స్వరూపానందేంద్ర. ఉత్తరాదిలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటాయి… దేశమంతటా వాహన ప్రమాదాలు అధికమవుతాయని వివరించారు. ఎండలు, వడదెబ్బలు ఎక్కువగా ఉంటాయి… జూలై నుండి సెప్టెంబరు వరకు ఇబ్బందికరమైన పరిస్థితులు కొనసాగుతాయి.. విదేశాల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని వివరించారు స్వరూపానందేంద్ర.

Read more RELATED
Recommended to you

Exit mobile version