పైరవీలతో టికెట్లు రావు.. కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జి ఠాక్రే క్లారిటీ

-

పెద్ద పెద్ద వారితో పరిచయాలు, పైరవీలతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు రావని కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్వహించే సర్వేల ఆధారంగా గెలిచే అవకాశాలున్న వారికి మాత్రమే టికెట్లు ఇస్తామని తెలిపారు. కర్ణాటక ఫలితాలు తెలంగాణలో కూడా వచ్చేలా అందరం కలిసి కష్టపడదామని అన్నారు.

‘‘కర్ణాటకలో కష్టపడి గెలిచాం. తెలంగాణలోనూ గెలుస్తాం. పెద్ద నేతలతో పరిచయాలున్నంత మాత్రాన ఎవరికీ టికెట్లు రావు. పార్టీకి నష్టపరిచే పనులు ఎవరు చేసినా చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో కేసీఆర్‌, భాజపాల తెరచాటు స్నేహాన్ని ప్రజలకు వివరించాలి. ప్రజా సమస్యలపై అన్ని స్థాయుల్లో పోరాటాలు నిర్వహించాలి. ఎన్నికలు దగ్గర పడుతున్నందున నేతలంతా ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్‌పై విశ్వాసం పెంచాలి. పార్టీలో కోవర్టులు లేరు. నేతల మధ్య విభేదాలు లేవు. బీజేపీకి కర్ణాటక ప్రజలు గుణపాఠం చెప్పారు. ” అని కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్ రావు అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version